తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీ షో లు అయిన ఎగస్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఇలాంటి కార్యక్రమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది రష్మి. ముఖ్యంగా తన పొట్టి పొట్టి బట్టలతో కుర్రకారును పిచ్చెక్కించే హాట్ హాట్ అందాలతో యాంకరింగ్ చేసే రష్మీ కి తెలుగు యువత లో మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు ఫ్యాన్ ఫాలోయింగ్ అదిరిపోయే రీతిలో ఉంది. అంతేకాకుండా తనకు సంబంధించి మరియు బయట విశేషాలకు సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి తన వ్యక్తిగత విషయాల గురించి ఇంకా తనపై వచ్చే ప్రతి రూమర్ విషయం గురించి అదేవిధంగా ఫ్యూచర్ ప్రాజెక్టు విషయాల గురించి తన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా సొసైటీలో జరిగే ప్రతి అంశం గురించి రష్మి స్పందిస్తుంది.

 

ముఖ్యంగా మూగ జీవాలు అంటే తనకు ఇష్టం ఉండటంతో..వాటి జాగ్రత్తలకు సంబంధించిన పోస్టులు తరచుగా పెడుతూ ఉంటుంది. అంతేనా..వల్గర్ కామెంట్స్ పెట్టే ఆకతాయి నెటిజన్లకు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. తాజాగా  ‘ఉమెన్స్ డే’ సందర్భంగా రష్మి పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఒకవైపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబతూనే దేశంలోని న్యాయవ్యవస్థపై తన మార్క్ సెటైర్లు వేసింది ఈ యాంకర్. విషయంలోకి వెళితే దేశంలోనే సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరికీ మతిపోగొట్టేసింది.

 

ఇండియాలో ఓ మహిళ 8 ఏళ్ల నుంచి తన కూతురుకి జరిగిన అన్యాయం గురించి న్యాయం కోసం పోరాటం చేస్తుంది అంటూ నిర్భయ అంశాన్ని ప్రస్తావించింది. ఇలాంటి దేశంలో ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు అని పోస్ట్ చేసింది. ఆ పోస్టులో నిర్భయ తల్లి ఆశా దేవి కన్నీరు పెట్టుకుంటున్న ఫోటోతో కామెంట్ చేసింది. దీంతో ఈ ఫోటో తో కూడిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: