ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన దొరబాబు, పరదేశీ వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట దొరబాబును వ్యభిచారం కేసులో ఎవరైనా కావాలని ఇరికించారా...? అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. కానీ పోలీసులు ఒక ఫిర్యాదు విషయంలో వెళ్లగా దొరబాబు వ్యభిచారం గుట్టు రట్టయిందని సమాచారం అందుతోంది. 
 
పోలీసులకు దొరబాబు ఉన్న ఫ్లాట్ పక్కనే ఉన్న మరో ఫ్లాట్ లో కొందరు పేకాట ఆడుతున్నారని ఎవరో ఫిర్యాదు చేశారు. పోలీసులు రైడింగ్ లో పేకాట ఆడుకున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకులు పక్క ఫ్లాట్ లో జబర్దస్త్ నటులు కొంతమంది ఉన్నారని... వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫ్లాట్ కు వెళ్లగా అక్కడ దొరబాబు, పరదేశీ వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికారు. 
 
బుల్లితెర వర్గాల్లో గత మూడు రోజుల నుండి జబర్దస్త్ నటులు అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరినీ జబర్దస్త్ షో నుండి తొలగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పోలీసులను అరెస్ట్ చేయద్దని బ్రతిమాలారని... కాళ్లు కూడా పట్టుకున్నారని ఒక వీడియో వైరల్ అవుతొంది. దొరబాబు హైపర్ ఆది టీమ్ లో మొదటినుండి నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
2018లో దొరబాబు నెల్లూరు లోకల్ ఛానల్ లో యాంకర్ గా పని చేసే అమూల్య రెడ్డిని వివాహం చేసుకున్నాడు. దొరబాబుకు అతని భార్య మాత్రం సపోర్ట్ గా నిలుస్తోంది. భర్త అరెస్ట్ అయిన తరువాత ఆమె భర్త పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. అంతలా ప్రేమించే భార్య ఉంటే అవేం పాడు పనులు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో జబర్దస్త్ షో పరువు పోయిందని మల్లెమాల నిర్వాహకులు ఫీల్ అయినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: