హోప్స్ పెట్టుకున్న సినిమా ఆగిపోతే ఏ హీరో అయినా ఢల్ అవుతాడు. కొంచెం సైలెంట్ అవుతాడు. కానీ నాగచైతన్య మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఒకటిపోతే రెండు ఉన్నాయి అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ రెడీ చేస్తున్నాడు చైతన్య. 

 

నాగచైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని గీతా ఆర్ట్స్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ నుంచి చైతన్య ఫ్రీ అవ్వగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనే టాక్ వచ్చింది. కానీ మధ్యలో మహేశ్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ ప్లానింగ్ లో మార్పులొచ్చాయి. 

 

పరశురామ్ గీత గోవిందం తర్వాత మహేశ్ బాబు కోసం ట్రై చేశాడు. సిట్టింగ్స్ కూడా జరిగాయి. అయితే అప్పుడు స్క్రిప్ట్ నచ్చలేదని పరశురామ్ ని హోల్డ్ లో పెట్టాడు మహేశ్. దీంతో నాగచైతన్య దగ్గరకు వెళ్లి ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాడు. కానీ ఈ మధ్య వంశీ పైడిపల్లికి నో చెప్పిన మహేశ్, మళ్లీ పరశురామ్ కు కబురంపాడు. 

 

మహేశ్ బాబు నుంచి కాల్ రావడంతో నాగచైతన్య ప్రాజెక్ట్ ని పేపర్లపైనే ఉంచేశాడు. మహేశ్ మూవీ అయ్యాక అక్కినేని సినిమా అనే నిర్ణయానికి వచ్చాడట. దీంతో నాగచైతన్య మరింత స్పీడ్ పెంచుతున్నాడు. ఈ గ్యాప్ లో రెండు సినిమాలు రెడీ చేద్దాం అనే థాట్ లో ఉన్నాడట చైతన్య. 

 

నాగచైతన్యకు ప్రేమ కథలకు విడదీయరాని అనుబంధం ఉంది. కెరీర్ లో కుదుపులు వచ్చినప్పుడల్లా ప్రేమ కథలతోనే గట్టెక్కాడు. ఇప్పుడు కూడా లవ్ స్టోరీస్ లోనే నటిస్తున్నాడు చై. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ని సమ్ థింగ్ స్పెషల్ గా ప్రజెంట్ చేసే డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అవుతున్నాడు చైతన్య.

 

పరశురామ్ ప్రాజెక్ట్ వెనక్కు వెళ్లడం ఆలస్యం, నాగచైతన్య రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో థాంక్యూ పేరుతో తెరకెక్కబోతోంది మూవీ. అలాగే నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: