టాలీవుడ్ లో రామ్ చరణ్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ముందు నుంచి కూడా అతను అనుభవం ఉన్న దర్శకులతోనే ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. చిరుత సినిమాను పూరి జగన్నాథ్ తో చేసాడు. ఆ తర్వాత మగధీర సినిమాను రాజమౌళి తో చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఎవడు సినిమా, ఆరెంజ్, ధ్రువ, రంగస్థలం సినిమాలు ఇలా ఏ సినిమా చూసినా సరే అతను ఇలాగే నటించాడు. ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నాడు ఈ స్టార్ హీరో. 

 

ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్. ఈ సినిమా గురించి ఇతర హీరోలు తమ సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే, రామ్ చరణ్ కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు ఆ దర్శకుడి గురించే చర్చలు అన్నీ నడుస్తున్నాయి. 

 

రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ని ఒక యువ దర్శకుడి తో... డెబ్యు డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వాలని రెడీ అయ్యాడట. ప్రదీప్ అనే యువ దర్శకుడు తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా చర్చలు అన్నీ పూర్తి అయ్యాయని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి చిరంజీవి కూడా కొన్ని మార్పుచేర్పులు సూచించి ఓకే చేసారని అంటున్నారు సినీ జనం. 2021 ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశముందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: