సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగి సక్సస్ అయ్యారు. అనిల్ రావి పూడి తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో సినిమా కమిటవుతున్నాడు అన్న విషయంలో పక్కాగా వంశీ పైడిపల్లి ప్రాజెక్టు అని క్లారిటీ ఉండింది. అయితే కథ నచ్చక మహేష్ బాబు క్యాన్సిల్ చేశారని ఓపెన్ గానే చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా వంశీ పైడిపల్లి ఇంకో లైన్ చెప్పినా మహేష్ బాబు కన్విన్స్ అవలేదు. అయితే సరిలేరు షూటింగ్ సమయంలోనే అనిల్ రావిపూడికి 'ఎఫ్3' లో నటిస్తానని మాటిచ్చారు. అన్నట్టుగానే మహేష్ బాబు ఎఫ్ 3 లో కమిటయ్యారని అంటున్నారు.

 

అలాగే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'ఆచార్య' సినిమాలో ముఖ్య పాత్ర నటిస్తున్నారట. ఈ సినిమాకోసం మహేష్ బాబు కి 40 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. అంతేకాదు మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా పరశురామ్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని న్యూస్ బాగా వైరల్ అవుతోంది. 

 

అయితే ఇప్పటివరకూ మహేష్ నుంచి .. ఏ సినిమాలో నటిస్తున్నారో క్లారిటీ రాలేదు. అందుకే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని అంటున్నారు. అందుకే మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారో క్లారిటి ఇవ్వాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు మేము టెన్షన్ తో చచ్చేలా ఉన్నామని బాబు కి చెబుతున్నారట. మరి మహేష్ బాబు ఎవరి తో ప్రాజెక్ట్ కమిటయ్యాడో తనే క్లారిటి ఇవాలి. ఎందుకంటే కొరటాల శివ చిరంజీవి సినిమాలో మహేష్ బాబు కి బదులు ఎన్.టి.ఆర్ వచ్చి చేరబోతున్నాడని కొత్తగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: