బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ పై ఇటీవల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ లో పాల్గొని టైటిల్ విన్నర్ కైవసం చేసుకోవడంతో వరుస అవకాశాలు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుని కెరియర్ కొనసాగిస్తూ రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి ప్రాంతం వద్ద ఓ పబ్ లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిక్ రెడ్డి తో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో రాహుల్  సిప్లిగంజ్ పై బీర్ బాటిల్స్ తో దాడి చేశారు రిషిక్ రెడ్డి అతని ఫ్రెండ్స్. ఇక మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాహుల్ సిప్లిగంజ్.

 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్ పలు సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంలో బీజేపీ నేత శ్వేత రెడ్డి... రాహుల్ సిప్లిగంజ్ మీడియా ముందు మాట్లాడిన విధానం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతడు గొడవకి కారణం రాహులే అంటూ ఆమె మాట్లాడటం జరిగింది. క్లియర్ కట్ గా మ్యాటర్ వెళ్తే దాడి జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు రాహుల్ ని మీరు ఎందుకు పబ్ కి వెళ్లారు అని ప్రశ్నిస్తే...అతడు చాలా దురుసుగా మీరు వెళ్ళారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు...అసలు అతడికి మాట్లాడే విధానం తెలియదు అంటూ శ్వేతారెడ్డి షాపింగ్ కామెంట్లు చేశారు.

 

సెలబ్రిటీలు కాబట్టి మీడియా ప్రతినిధులు అడిగారు దానికి అతను ఆ విధంగా మాట్లాడాలా ఎదురు ప్రశ్నలు వేయడం ఏంటి అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇటువంటి వ్యక్తుల వల్లే మరియు ఇలాంటి అలవాట్లు కలిగిన యువత వల్ల రాష్ట్రంలో యువత పబ్ కి అలవాటు పడుతున్నట్లు ఆమె వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్న రాహుల్ అభిమానులు అటు తిరిగి ఇటు తిరిగి .. అంతా కలిసి .. రాహుల్ సిప్లిగంజ్ ని ఇరికించేలా ఉన్నారు గా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా మీ రాజకీయ నాయకులంతా ఒక్కటేనని మరికొంత మంది శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: