ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చిన్న చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  కంటెంటె బాగుంటే ఎలాంటి చిత్రం అయినా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.  అయితే  ఇలాంటి చిత్రాలు కథలు బాగుంటేనే మళ్లీ ఆదరణ లేదంటే కంటికి కూడా కనిపించకుండాపోతున్నారు.  ఇటీవలే విడుదలైన పలాస 1978 చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించాడు తమ్మారెడ్డి. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సినిమాలు ఆడుతున్నవి ఎక్కువే ఉన్నా దేనికీ కలెక్షన్స్ రాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఫిబ్రవరి నుండి మార్చ్ వరకూ టాలీవుడ్ అన్ సీజన్ గా చెప్పుకుంటారు.  పెద్ద చిత్రాలు అయితే సంక్రాంతికి లేదా తర్వాత వచ్చే సమ్మర్ కు విడుదలలు షెడ్యూల్ చేసుకుంటాయి. ఈ సమయంలో చిన్న చిత్రాలు రిలీజ్ అయితే కష్టకాలమే.. కానీ కథ బాగుంటే కాస్త నెట్టుకొని రావొచ్చు. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు కరోనా భయం జనాలకు పట్టుకుంది.  దాంతో సినీ పరిశ్రమ కు గడ్డు కాలం వచ్చింది.   

 

ఈ  నేపథ్యంలో మంచి చిత్రం తీసి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని బాధపడ్డాడు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అప్పటి ఊరి సంస్కృతిని, నేపధ్యాన్ని సినిమాలో చక్కగా చూపించామని, మంచి చిత్రం తీసినా కూడా థియేటర్లకు జనాలు రాకపోతే ఇక ఏమంటామని అన్నాడు.  ప్రతి ఒక్కరూ  సంస్కృతి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు.. కానీ వాటికి అద్దం పట్టేలా చిత్రం తెరకెక్కిస్తే మాత్రం వాటిని చూడటానికి.. పది మందికి చెప్పడానికి మనసు రావడం లేదు.   మొదటి రోజు ఈ చిత్రానికి 20 శాతం ఆక్యుపెన్సీ ఉండడం దారుణం.

 

తన అసహనాన్ని స్టేజ్ పై నుండే ప్రేక్షకుల మీద వ్యక్తం చేసాడు. ఇలాంటి సినిమా చూడాల్సిన బాధ్యత మీకు లేదా.. మంచి సినిమా తీసాం కదా. ఇలాంటి చిత్రం చూడకపోతే ఇక మీ ఖర్మ అని వ్యాఖ్యానించాడు.   అయితే తమ్మారెడ్డి ఆవేదనలో ఓ అర్థం ఉంది.. మన  సంస్కృతి గురించి ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా వ్యాఖ్యానిస్తుంటారు.. కానీ ఆచరణలో ఎవరూ చూపించరు.  అందుకే మన పాత సాంప్రదాయాలు మరుగున పడుతున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: