ఇస్మార్ట్ శంకర్ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ హిట్ అందుకోవడమే కాదు హీరో రాం అలాగే హీరోయిన్స్ నిధీ అగర్వాల్, నభా నటేష్ ఫేట్ కూడా మార్చేశారు. అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించిన బ్యూటి నిధీ అగర్వాల్ కి ఆ రెండు సినిమాలు దారుణమైన పరాజయాన్ని అందుకొని అన్ లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ ఇచ్చాయి. దాంతో ఇక నిధీ అగర్వాల్ కి టాలీవుడ్ లో అవకాశాలు ఎవరూ ఇవ్వరని డిసైడయిపోయింది. తను అనుకున్నట్టుగానే మేకర్స్ కూడా తనని పక్కన పెట్టారు.

 

అయితే నిధీకి పూరి జగన్నాధ్ షాకిచ్చాడు ఇస్మార్ట్ శంకర్ లో గోల్డెన్ ఆఫర్ ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. అలాగే నభా నటేష్ కూడా. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు పొందింది. అయితే ఆ సినిమా తర్వాత మాత్రం నభా కి అవకాశాలు రాలేదు. దాంతో నభా కూడా టాలీవుడ్ మీద ఆశలు వదిలేసుకుంది. కానీ నిధీకి ఇచ్చినట్టే నభాకి పూరి ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. కానీ ఆ లైఫ్ కాస్త గందరగోళంలో పడింది ఈ ఇద్దరి బ్యూటీస్ విషయంలో.  

 

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే రవి తేజ పక్కన ఈ యంగ్ బ్యూటి నిధి హీరోయిన్ గా సూట్ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా రవితేజ ముందు నుంచి  కొత్త హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపించేవారు. అంతేకాదు ఫాం లో ఉన్న హీరోయిన్ కంటే కూడా కొత్త హీరోయిన్ సెంటిమెంట్ ని ఎక్కువగా రవితేజ నమ్ముతాడు.

 

కానీ ఈమధ్య కాలంలో రవితేజ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజాయాన్ని మూట గట్టుకుంటున్నాయి. అది తన పక్కన నటించిన హీరోయిన్స్ కి బాగా మైనస్ అవుతోంది. అందుకే కొంతమంది రవితేజ సినిమాలో మేకర్స్ ఆఫర్ ఇచ్చినా నిర్మొహమాటంగా రిజక్ట్ చేస్తున్నారట. ఇక రవితేజ-నిధీ జోడీగా నటించే సినిమాతమిళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని సమాచారం. అయితే పూరి లైఫ్ ఇచ్చిన నభా నటేష్ రవితేజ తో నటించిన డిస్కోరాజా దారుణంగా ఫ్లాపయింది. ఆ భయం ఇప్పుడు నిధీకి పట్టుకుందట. పాపం ఈ ఇస్మార్ట్ బ్యూటీస్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే మాస్ జనాలు వీళ్ళని దొందూ దొందే అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: