టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుసగా విజయాలతో మంచి క్రేజ్, ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. కొన్నేళ్ల క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో ఘోర పరాజయాలు అందుకుని కొంత ఢీలా పడ్డ మహేష్, ఆ తరువాత వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, అలానే ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాల సూపర్ హిట్స్ తో కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు అందుకుని ఎంతో జోష్ తో ముందుకు సాగుతున్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించబోయే తదుపరి సినిమా అనౌన్సుమెంట్ కూడా రానుంది. 

 

మరోవైపు అంతకముందు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని దర్శకుడు పూరి జగన్నాథ్, ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు పూరి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్నేళ్ల క్రితం మహేష్ - పూరి కాంబోలో వచ్చిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ పోకిరి అనంతరం కొన్నాళ్ళకు వారిద్దరితో కలిసి హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వారు, రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ నిర్మాణ సంస్థతో కలిసి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫీల్ తో అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ లో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. 

 

మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ఇద్దరూ కూడా ఆ సినిమా విషయమై అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూ ల్లో చెప్పడం జరిగింది. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, కొద్దిరోజుల తరువాత ఆ సినిమా పట్టాలెక్కకుండా, చర్చల దశలోనే అటకెక్కింది. అయితే ఆ సమయంలో మహేష్ బాబు కనుక ఆ సినిమా చేసుంటే, నిజంగా ఆయన క్రేజ్ ఈపాటికే పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా భారీగా పెరిగేదని, కానీ ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం దురదృష్టకరం అని ఇప్పటికీ కొందరు మహేష్ ఫ్యాన్స్ అంటుంటారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: