‘భీష్మ’ సూపర్  సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా ఆ మూవీ కేవలం రెండు వారాలలో 50 కోట్ల కలక్షన్స్ వసూలు చేయడంతో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు. దీనికితోడు నితిన్ తాను 7 సంవత్సరాలుగా ప్రేమించిన షాలిని ని పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోబోతు ఉండటంతో నితిన్ ఆనందానికి ప్రస్తుతం అవధులు లేవు. 


అయితే ఇప్పుడు నితిన్ ఆనందం పై కరోనా ఊహించని దెబ్బ కొట్టింది. తెలుస్తున్న సమాచారం మేరకు డెస్టినేషన్ మ్యారేజ్ గా దుబాయ్ లోని ప్రఖ్యాత హోటల్ ప్లహేజో వర్సస్ లో ఏప్రిల్ 16న జరగవలసిన పెళ్లిని అక్కడ నిర్వహించడానికి ప్రస్తుతం కరోనా సమస్యతో అరబ్ దేశాలలో కొనసాగుతున్న కఠినమైన ఆంక్షలు వల్ల నితిన్ కోరుకున్న ప్రదేశంలో పెళ్ళి జరిగే అవకాశం లేదు అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.


దీనితో కరోనా హడావిడి పూర్తిగా అదుపులోకి వస్తే దుబాయ్ లో అనుకున్న ప్రదేశంలో ఒకవేళ అక్కడ కుదరకపోతే హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పెళ్ళి జరిగే విధంగా ఇలా రెండు చోట్లా ఏర్పాట్లు చేస్తూ నితిన్ కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నట్లు టాక్. ఈ నెలాఖరుకు నితిన్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అన్న విషయమై క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. 


ఇప్పటికే నితిన్ తన కాబోయే భార్య ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాంచీపురం వెళ్లి పెళ్ళికి సంబంధించిన షాపింగ్ కూడ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్ళి పూర్తి అయిపోయిన తరువాత ఏప్రిల్ 21న హైదరాబాద్ హైటెక్స్ లో చాల గ్రాండ్ గా మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆ పార్టీకి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ హోదాలతో సంబంధం లేకుండా పిలవాలని నితిన్ ప్లాన్ అని అంటున్నారు. దీనితో ఏప్రిల్ నెల అంతా మీడియాలో నితిన్ పెళ్ళి ఫోటోల హంగామా అంతా చాల ఎక్కువగా కనిపించే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: