మ‌హేష్ టైమ్ ఇప్పుడు పీక్స్‌లో న‌డుస్తుంది. ప‌ట్టుకున్న‌ద‌ల్లా బంగారం అన్న‌ట్లు ఆయ‌న న‌టించిన చిత్రాల‌న్నీ హిట్ బాట ప‌ట్టాయి. ఇటీవ‌లె వ‌చ్చిన చిత్రాల‌న్నీ వరుసగా “భరత్ అనే నేను”, “మహర్షి” మరియు “సరిలేరు నీకెవ్వరు” చిత్రాలతో ఒకదాన్ని మించి ఒకటి బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఐతే ఈ మూడు చిత్రాలను ఒక దాని తర్వాత మరొకటి మొదలు పెట్టడానికి పెద్దగా సమయం తీసుకోలేదు మ‌హేష్‌. ముఖ్యంగా గత చిత్రం `సరిలేరు నీకెవ్వరు` అయితే చాలా త్వ‌ర‌గా పూర్తి చేశారు.

 

కానీ ఇప్పుడు తన తర్వాత చిత్రం విషయంలో మాత్రం మ‌హేష్ కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డ్డాడు. నిజానికి ఈ పాటికే వంశీ పైడిపల్లితో సినిమా మొదలు అయ్యిపోవాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ సరిగ్గా కుదరకపోవడంతో అది కాస్తా వెనక్కు వెళ్ళిపోయింది. అనుకోకుండా జ‌రిగే స‌రికి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్ధం కావ‌డం లేదు. ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా వంశీ మాత్రం మ‌హేష్‌ని ఎందుకో త‌న క‌థ‌తో మెప్పించ‌లేక‌పోయారు. సరే ఇది పక్కన పెడితే అనూహ్యంగా దర్శకుడు పరశురామ్ రేస్ లోకి వచ్చారు. దీనిపై కూడా మహేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మ‌రి ఆయ‌న నెక్స్‌ట్ ఏం చేయాల‌నుకుంటున్నాడా అని డైల‌మాలో ఉన్నాడు. 

 


దీనితో ఇప్పుడు మహేష్ అభిమానులు అంతా కొరటాల మరియు మెగాస్టార్ ప్రాజెక్ట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఓ ప‌క్క మ‌హేష్ చేస్తాడు అంటున్నారు మ‌రోప‌క్క ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. చివ‌రికి ఎవ‌రిని ఓకే చేస్తారో మ‌రి ఇంకా తెలియ‌డం లేదు. అంతేకాక మ‌హేష్ ఈ చిత్రం కోసం 40 క‌ట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రి అంత రేంజ్‌ని చ‌ర‌ణ్ త‌ట్టుకోగ‌ల‌డా లేదా అన్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైన‌ప్ప‌టికీ  దాదాపు ఇది ఖరారు అనిపిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో కూడా మహేష్ ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారనిపిస్తుంది. దీనితో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా గురించి ఏ ఒక్క అప్‌డేట్ కూడా రాలేదని సోషల్ మీడియాలో డ‌ల్ అయిపోయారు. కనీసం వీరికోసం అయినా మహేష్ ఏదన్నా తొందరగా నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. ఇక చాలా మంది కోరుకునేది ఏమిటంటే మ‌హేష్, చిరు కాంబినేష‌న్ చూడాల‌నుకుంటున్నారు. మ‌రి మ‌హేష్ ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటాడో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: