మహేష్ బాబు నెక్స్ట్ ఫిలిం గురించి సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.   వంశీ పైడిపల్లి ప్రాజెక్టు క్యాన్సిల్ అయిన తరువాత వార్తలలోకి వచ్చిన  చిరంజీవి ‘ఆచార్య’ లో అతిథి పాత్ర విషయమై ఇప్పటికి క్లారిటీ లేదు. దీనితో మహేష్ పరశు రామ్ ప్రాజెక్ట్ ఓకె అయింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న పరిణామాలు వేరు.


తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ వేల కొట్లలో బ్యాంక్ లను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా నీరజ్ మోడీలు చేసిన భారీ స్కామ్ ల నేపధ్యంలో కథ వ్రాయమని మహేష్ పరుశు రామ్ కు చెప్పినట్లు టాక్. అయితే ఇప్పటికే అందరికి తెలిసిన ఇలాంటి సాదాసీదా కథను సినిమాగా తీస్తే ఎవరు చూస్తారు అని పరుశు రామ్ మహేష్ తో చెపుతున్నట్లు తెలుస్తోంది. 


ఈ పాయింట్ ను ఆధారంగా తీసుకుని కథను వెరైటీగా వ్రాయమని మహేష్ చెపుతున్న మాటలను బట్టి కథ ఎలా వ్రాయాలో తెలియక పరుశు రామ్ తిప్పలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం మహేష్ వద్దకు వస్తున్న కొంతమంది దర్శకులకు కూడ మహేష్బ్యాంక్ ల స్కామ్ ల లైన్ ఇచ్చి దాని పై కథను డెవలప్ చేయమని కోరుతూ ఉండటంతో మహేష్ కు ఈ స్కామ్ ల పిచ్చి ఏమిటి అంటూ చాలామంది దర్శకులు తలలు పట్టుకుంటున్నట్లు టాక్. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే మహేష్ నటించే సినిమా కథలను విని అలవాటు ఉన్న నమ్రత కూడ ఇలాంటి స్కాముల స్టోరీ లైన్ తో కథ వ్రాయమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. 


దీనితో మహేష్ నమ్రత లకు ఒకేసారి ఇలా స్కాము లపై మోజు ఏమిటీ అంటూ జోక్స్ పడుతున్నాయి. ఇప్పటికే మహేష్ తాను నటించే సినిమాల కథల విషయంలో పొరపాట్లు చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఆ మాటలను పట్టించుకోకుండా మహేష్ ఇలా రొటీన్ సినిమా కథల వైపు అడుగులు వేయడం అతడి కెరియర్ కు అంత మంచిది కాదు అంటూ చాలామంది దర్శకుల అభిప్రాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: