నాచ్యురల్ స్టార్ నాని 2008లో వచ్చిన అష్టా చమ్మా సినిమాతో వెండితెరకు పరిచయం ఆయ్యారు.. అలా స్లోగా ప్రేక్షకులకు చేరువైన నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా, సక్సె బాటలో వెళ్లుతున్న ఈ హీరో ఇటీవలే నిర్మించిన ‘హిట్’ మూవీ రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ప్రస్తుతం నాని మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీస్తోన్న "వి" చిత్రంలో నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుండగా, మరోవైపు ‘టాక్సీవాలా’ ఫేమ్  రాహుల్​ సంకృత్యాన్ దర్శకత్వంలో  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే మూవీలో నటించనున్నాడు.

 

 

ఇకపోతే "వి"  షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం మే నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇదిలా ఉండగా ఈ కొత్త మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ మ్యాటర్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమంటే ఈ సినిమా కథను నాని రూ.50 లక్షలు పెట్టి కొన్నాడని సమాచారం. ఈ సినిమా స్టోరీ థీమ్ కొత్తగా అనిపించడంతో,  నాని  ఇంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు వెనకాడలేదని వార్త.. ఇకపోతే హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి దగ్గర ఈ కథను కొన్నట్లు ప్రచారం జరుగుతుంది..

 

 

ఇంతకు నాని ఈ చిత్ర కథ కు అంత ఖర్చు పెట్టాడంటే, అందులో బలమైన కథ, కథనాలు ఉండి ఉండవచ్చని అనుకుంటున్నారట.. మరి ఈ న్యూస్ గాలి వార్తో, లేక గట్స్ ఉన్న వార్తో తెలియాలంటే మూవీ వర్గాల నుంచి అఫిషియల్ ప్రకటన రావాల్సిందే. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు వివేక్‌ ఆత్రేయతో మరో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట... ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని సమాచారం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: