శర్వానంద్ ,సమంత జంటగా నటించిన చిత్రం జాను. గత నెలలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా కూడా  వసూళ్లను రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో డిజాస్టర్ సినిమా గా మిగిలిపోయింది. సుమారు 18కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం అందులో సగానికి పైగా కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడంతో తాజాగా ప్రైమ్  ఈ సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
 
కోలీవుడ్  సూపర్ హిట్ కల్ట్ మూవీ  '96' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకుడు కాగా  గోవింద్ వసంత  సంగీతం అందించాడు. దిల్ రాజు  నిర్మించాడు. ఇక ఇటీవల  వరుస పరాజయాలను చవి చూసిన శర్వానంద్ కు జాను మరో డిజాస్టర్ ను ఇవ్వగా గత కొంత కాలంగా వరుస విజయాల తో దూసుకుపోతూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కు ఎట్టకేలకు పరాజయాన్ని రుచిచూపించింది. 
 
ఇదిలావుంటే శర్వానంద్  ప్రస్తుతం శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు  బి కిషోర్ డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా రైతు పాత్రలో కనిపించనున్నాడు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. జులై లో ఈసినిమా విడుదలకానుంది. ఈ సినిమా తోపాటు శర్వా ప్రస్తుతం శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో  డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం లో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ఇటీవలే కిశోర్ తిరుమల తో ఓ సినిమా చేయడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక జాను తరువాత సమంత మాత్రం  తెలుగులో ఇంతవరకు మరో సినిమా కు సైన్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: