దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. అయితే ఈ ఏడాది హోలీ వేడుకలు జరుపుకునేందుకు అభిమానులు జంకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాందోళనలు సృష్టిస్తుండటంతో హోలీ వేడుకలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ సారి హోలీ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు కూడా హోలీ వేడుకులకు సంబంధించిన అభిమానులకు సందేశాలిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పవిత్ర పునియా తన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా ఓ మేసేజ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా అభిమానులను కెమికల్ బేస్డ్ కలర్స్ వాడవద్దని కోరింది పవిత్ర. `నాకు తెలిసినంత వరకు హోలీ అనేది సన్నిహితులు కుటుంబ సభ్యులు కలిసి చేసుకునే పండుగ. సందర్భంగా ఏడాది అంతా గుర్తుండిపోయే జ్ఞాపకాలు సంపాదించుకోవాలి. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నేను హోలీ ఆడేందుకు ప్లాన్ చేసుకున్నా.. కానీ నాకు నీటిని వృథా చేయటం ఇష్టం ఉండదు. అందుకే నేను సహజ సిద్ధమైన గులాల్ను మాత్రమే వాడతాను. తరువాత రుచికరమైన వంటకాలను సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించి ఎంజాయ్ చేస్తాను` అంటూ కామెంట్ చేసింది.
`నా అభిమానులను కూడా నేను ఇదే కోరుతున్నాను. అందరూ సహజసిద్దమైన రంగులతో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన రంగులు వినియోగించటం మానేయండి. అదే సమయంలో నీటిని కూడా వృథా చేయటం మానండి` సోషల్ మీడియా వేదిక అభిమానులను కోరింది పవిత్ర పునియా. ప్రస్తుతం పవిత్ర సోని సాబ్లో ప్రసారం అవుతున్న బాల్వీర్ రిటర్న్స్లో కీలక పాత్రలో నటిస్తోంది.