సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ చేయడానికి రెడీ అయిపోతుంటారు దర్శకులు. ఆ సినిమా విజయం సీక్వెల్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుందన్న నేపథ్యంలో సీక్వెల్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే తెలుగులో వచ్చిన చాలా సీక్వెల్ ఫెయిల్యూర్ అయినవే. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఏది ఏమైనా హిట్ అయితేనే సీక్వెల్స్ ప్లాన్ చేస్తారు. 

 

కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా కొత్త దర్శకుడు శైలేష్ కొలను ఆలోచించడం విచిత్రంగా అనిపిస్తుంది. శైలేష్ కొలను ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో హిట్ అనే సినిమా తీశాడు.ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్  కేసు గురించిన ఇన్వేస్టిగేషన్ ప్రాసెస్ ని పూస గుచ్చినట్లు ఆసక్తికరమైన మలుపులతో చూపించే ప్రయత్నం చేసినా అది ప్రేక్షకులకి అంతగా రుచించలేదు.

 

 

అదీ గాక సరైన సీజన్ లో రిలీజ్ చేయకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్ గా మారింది. అటు పదవ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ నడుస్తున్న నేపథ్యంలో జనాలు థియేటర్లకి రావడమే లేదు. దాంతో అసలే కంటెంట్ వీక్ గా ఉన్న ఈ హిట్ సినిమాకి జనం ఎక్కువగా వెళ్ళట్లేదు. ఇలాంటి సినిమాకి ఎవ్వరూ సీక్వెల్ చేయాలని అనుకోరు. కానీ శైలేష్ కొలను మాత్రం సీక్వెల్ తీస్తాడట.

 

 

హిట్ సినిమాలో ఫస్ట్ కేస్ ని చూపించిన శైలేష్ సెకండ్ కేస్ తో మళ్ళీ వస్తాడట. మరి ఈ సీక్వెల్ ని ఎవరు నిర్మిస్తారని ఆసక్తిగా మారింది. నిజంగా శైలేష్ తీసే సీక్వెల్ ని నాని ఒప్పుకుంటాడా లేదా అనేది అనుమానంగా ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో.. అయితే హిట్ అయిన అ! సినిమాకే సీక్వెల్ రెడీగా ఉన్న చేయడానికి సిద్ధంగా లేని నాని హిట్ సీక్వెల్ తీయడని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: