కీర్తి సురేష్ అసలు ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు కాబోలు. నేను శైలజా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ బ్యూటీ. తర్వాత కొన్ని సినిమాలలో తెలుగులో నటించారు కానీ.. ఈ బ్యూటీ మాత్రం మహానటి సినిమాతో అందరి హృదయాలను గెలుచుకన్నారు. అయితే.. ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి మనసుల్ని ఆకట్టుకుని, అందరి మన్ననలు పొంది జాతీయ గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఈ మలయాళ భామ. అసలు ఈమె ఏ సినిమా చేసిన తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే.. కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రయూనిట్ ప్రకటించారు. కాగా., ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేయాలని నిర్ణయించినట్లు ట్విటర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించారు. కాగా., మిస్ ఇండియా సినిమా ద్వారా దర్శకుడిగా నరేంద్ర పరిచయం అవుతున్నారు.
Where there is us, there is always magic!
— Keerthy suresh (@KeerthyOfficial) March 8, 2020
Wish you all a Happy Women’s Day on behalf of team #MissIndia#DreamBig #ChaseYourDream @smkoneru @NARENcloseup @THARUNdirects @MusicThaman @EastCoastPrdns @gopiprasannaa pic.twitter.com/lBg4mj2eAB
కీర్తి సురేష్ ఆదివారం ఒక ట్వీట్ చేసారు. ఏమని చేశారంటే.. ‘‘మేము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ మ్యాజిక్ ఉంటుంది. మా టీం అందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ ట్వీట్ చేశారు. ఆమె సినిమాలు చేయక దాదాపు సంవత్సరం అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ సినిమా చేయక దాదాపు సంవత్సరం దాటింది.
పోయిన సంవత్సరం అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు- 2లో నటించింది ఈ భామ. కానీ ఆమె ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. అయితే ‘మిస్ ఇండియా’ సినిమాలో మల్టిపుల్ పాత్రల్లో కీర్తి కనిపించనున్నట్లు సమాచారం. కాగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ మూవీలో జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భాను శ్రీ మెహ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.