టాలీవుడ్ లో ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే పూజా హెగ్డే ,రష్మిక మందాన హడావుడి నడుస్తుంది అనే చెప్పాలి. ఈ భామలు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. వీరి ఇద్దరు నటించిన ప్రతి సినిమా బాక్సఫీస్ వద్ద కాసులు కురుపిస్తున్నాయి. తమ నటన, అందంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. వీరి నటించే సినిమాల్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత పాత్రలు వస్తున్నాయి. అంతే కాకుండా పెద్ద హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తున్నారు. దర్శక ,నిర్మాతలు కూడా వీరిద్దరిని తమ సినిమాలో ఉండేలా ఆసక్తి చూపిస్తున్నారు.

 

పూజా హెగ్డే ముంబై నుంచి వచ్చిన ఈ భామ ముకుంద అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .కానీ ఈ సినిమా బాక్సఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడుకి నిరాశ ఎదురు అయింది. పాప ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు, కానీ పూజా అవకాశం కోసం ఎదురు చూసింది. అల్లుఅర్జున్ తో నటించిన డీజే సినిమాలో ఈ అమ్మడు చేసిన నటనకి, అందానికి కుర్రకారు ఫిదా అయ్యింది, వరుస పెద్ద సినిమాల్లో, నటించే  అవకాశం వచ్చింది.

 

రష్మిక మందాన చలో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. దీనితో అమ్మడుకు వరుస ఛాన్సులు క్యూ కట్టాయి. గీతగోవిందం రీసెంట్ గా వచ్చిన బీష్మ హిట్లతో మంచి జోష్ లో ఉంది. వరుస ఆఫర్లతో బిజీ బిజీ గా గడుపుతుంది. ఇది అంత బాగానే ఉన్న టాలీవుడ్ లో ఒక టాక్ మొదలైంది. అదేంటి అంటే పూజా ,రష్మిక మధ్య సినీ వార్ నడుస్తుంది అని అంటున్నారు. వీరి ఇద్దర్లో ఎవరిని తీసుకోవాలో తెలియడం లేదు అంట. త్రివిక్రమ్ తన కొత్త సినిమాలో పూజా ని తీసుకోవాలని అనుకున్నారు అంట. ఇదే విషయాన్ని పూజని అడిగితే డేట్లు సర్దుబాట్లు కాక నో చెప్పేసింది అంట. అయితే పూజా ప్లేస్ లో రష్మిక ని సంప్రదించారని ఇండస్ట్రీ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: