ప్రభాస్.. ఒక్క సినిమాతో ఇండియా మొత్తం అభిమానులు సంపాదించుకున్నాడు. అదే బాహుబలి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సిందే. ఇటు టాలీవుడ్ లెక్కలతో పాటు అటు బాలీవుడ్ రికార్డులు ని బద్దలు కొట్టింది. అంతే కాకుండా ఇండియా వైడ్ 1500  కోట్లు కలెక్షన్స్ సాధించి  టాప్ ప్లేస్ లో నిలిచింది. అంతే కాకుండా ఇతర దేశాల్లో డబ్బింగ్ లో రిలీజ్ ఘనమైన రికార్డు సొంతచేసుకుంది. ప్రభాస్ ని పాన్ ఇండియా హీరోని చేసింది ఈ సినిమా.

 

ప్రభాస్ బాహుబలి లాంటి తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడో అని దేశం మొత్తం ఎదురు చూసింది. ఎందరో గొప్ప దర్శక, నిర్మాతలు  ప్రభాస్ తో సినిమా కోసం క్యూ కట్టారు.కానీ ప్రభాస్ యువ దర్శకుడు అయిన సుజిత్ కి అవకాశం ఇచ్చాడు. సుజిత్ దర్శకత్వం లో ప్రభాస్ సాహూ అనే సినిమా లో నటించాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దాదాపు 350  కోట్ల తో నిర్మించారు. హీరోయిన్ ని బాలీవుడ్ కథానాయిక శ్రద్ధ కపూర్ నటించింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసారు. కానీ ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బోర్లాపడింది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించున్న కథ పరంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

 

 ప్రభాస్ బాహుబలి లాంటి సినిమా తర్వాత ,సాహూ లాంటి సినిమా తీసి తప్పు చేసారు అని చాలామంది అభిప్రాయపడ్డారు. అనవసరమైన ప్రయోగం చేసాడు అని ఇండస్ట్రీ లో పెద్దలు అనుకున్నారు అని టాక్. ఇదంతా ప్రభాస్ కెరియర్ పై ఎటువంటి ప్రభావం పడలేదు అనే చెప్పాలి. ఎందుకు అంటే సాహూ సినిమా ప్లాప్ అయిన కలెక్టన్స్ పరంగా మంచి వసూళ్లు సాధించింది. ఇదిఅంతా ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ వల్లే అని చెప్పొచ్చు. సాహో లాంటి సినిమా తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం చాల మంది వెయిట్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తే ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ అనే దర్శకుడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పూజాహెగ్డే .

మరింత సమాచారం తెలుసుకోండి: