తెలుగు హీరో అయిన ప్రభాస్ బాలీవుడ్ లో కూడా తన హవా చాటాడు. బాహుబలితో నేషనల్ స్టార్ డమ్ వచ్చిన తర్వాత అక్కడ ప్రభాస్ కు మంచి మార్కెట్ ఉంది. సాహో ఇదే విషయాన్ని నిరూపించింది. తెలుగులో ఫ్లాప్ అయిన సాహో బాలీవుడ్ లో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు ఉదాహరణ. మహానటితో జాతీయ స్థాయి సినిమా తీసిన వ్యక్తి నాగ్ అశ్విన్. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ మార్కెట్ పెరిగింది. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రాబోతోంది.

 

 

ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై వైజయంతీ మూవీస్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. ఈ సినిమా కథ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ అని, టైమ్ మెషీన్ ఆధారంగా.. అంటూ అనేక కథనాలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ అలిగాడని అంటున్నారు. తన కాన్సెప్ట్ ని వేరేవాళ్లు అనేక రకాలుగా చెప్పడం నచ్చని నాగ్ అశ్విన్ ఇప్పుడో నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రాజమౌళి స్టైల్లో కథ లైన్ ను ముందుగానే చెప్పాలని డిసైడ్ అయ్యాడట. అఫిషియల్ గా అలా కథ ప్లాట్ ను చెప్పేయడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ అంచనాకు వస్తారని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట,

 

 

రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూంటాడు. దీంతో సినిమా కోసం ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ముందుగానే ఈ సినిమాపై అఓ అంచనాకు వచ్చేస్తారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చని భావిస్తున్నాడట. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఓ డియర్ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో సినిమా ఈ ఏడాది చివరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: