ఈమధ్యనే తన కాలుకి సంబంధించిన అనారోగ్య సమస్యకు అమెరికాలో వైద్యం చేయించుకున్న మహేష్ ఇప్పుడు మళ్ళీ తన మానసిక ప్రశాంతత కోసం హిమాలయాల బాట పట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ గా తమిళ ప్రజలకు ఆరాధ్య దైవంగా పరిగణింపబడే రజినీకాంత్ ప్రతి సంవత్సరం తన మానసిక ప్రశాంతత కోసం వెళ్ళే హిమాలయ ప్రాంతంలోకి మహేష్ కూడ త్వరలో వెళుతున్నట్లు తెలుస్తోంది.


అక్కడ కొన్ని రోజుల పాటు నిష్ణాతుల ఆద్వర్యంలో యోగా మైండ్ పవర్ కు సంబంధించిన క్లాస్ లకు ఎటెండ్ అవుతూ కొద్దిరోజుల పాటు సినిమా జీవితానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కొరటాల చిరంజీవిల మూవీలో మహేష్ ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు అటకెక్కినట్లే అనుకోవాలి. 


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే మహేష్ పరుశు రామ్ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథ ఫైనల్ కావడానికి ఇంకా మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈమధ్య దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈమధ్య మహేష్ ను కలిసి ఒక వెరైటీ కథను చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


అయితే ఈ కథ విషయంలో కూడ మహేష్ తన నిర్ణయం పూర్తిగా చెప్పకుండా ఈనెలలో విడుదలకాబోతున్న ‘వి’ ఫలితం బట్టి మోహన్ కృష్ణతో తాను సినిమా చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని భావిస్తున్నట్లు టాక్. మహేష్ తో సినిమాలు చేయడానికి అనేకమంది దర్శకులు ఆసక్తి కనపరుస్తున్నా ప్రస్తుతం కథ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న మహేష్ తీరును బట్టి చూస్తుంటే మహేష్ లేటెస్ట్ మూవీ ప్రకటన కనీసం రెండు నెలలకు పైగా పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్ నుండి బయటపడి ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి మహేష్ హిమాలయాల బాట ఎంత వరకు ఉపకరిస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: