రెజీనా కాసాండ్రా.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయిన.. ఆ తర్వాత రోటీన్ లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో పిల్లా నువ్వే లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటీ చిత్రాల్లో నటించి నటనపరంగా మంచి గుర్తింపు సంపాధించుకుంది. ఇక ఇటీవల ‘ఎవరు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న రెజీనా కాసాండ్రా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై వైపు మొగ్గు చూపుతోంది.
ప్రస్తుతం రెజీనా ‘నేనే..నా’ అనే హార్రర్ మూవీలో నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధిన పోస్టర్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మరోవైపు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో రెజీనా స్పెషల్ సాంగ్లో చేస్తుంది. ఈ సందర్భంగా రెజీనా మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాలో ప్రత్యేక పాటలో చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను అన్నాడు. చిరంజీవి గారు నా డాన్స్కు ప్రశంసలు కురిపించడం మరింత ఆనందాన్ని కలిగించింది అన్నాడు.
అలాగే ఈ సినిమాలో చిరంజీవిగారు నటిస్తున్నారు కాబట్టే అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా 'ఓకే' చెప్పానని చెప్పింది రెజీనా. మరియు సినిమాలో చేసింది ఐటెమ్ సాంగ్ కాదంటూ దాన్ని అని పిలవొద్దని, సెలబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది. కాగా, ఇటీవల కాలంలో కోటి రూపాయల పారితోషికాలు అందుకుంటూ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ను చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటే.. రెజీనా మాత్రం తనకు ఐటెం సాంగ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు అంటోంది. దీంతో ఈ అమ్మడికి ఎందుకు ఐటెం సాంగ్ అంటే అంత అసహ్యం అన్నది హాట్ టాపిక్గా మారింది.