మిర్యాలగూడ కు చెందిన కోటీశ్వరుడు మారుతీ రావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన రెండేళ్లక్రితం తన కూతురి భర్త ప్రణయ్ ని కిరాయి గుండాల చేత కిరాతకంగా చంపిచేశాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అలాగే అనేకమైన చర్చలకు దారి తీసింది. అయితే మళ్లీ మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న నేపద్యంలో అమృత ప్రణయ్ లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. వీరి లవ్ స్టోరీ కారణంగా ఇద్దరు చనిపోయారని ప్రతి ఒక్కరూ ఆవేదన పడుతున్న సందర్భంలో ఒక సినీ వార్త తెరపైకి వచ్చి చాలా ఆసక్తికరంగా మారింది.




వివరాలు తెలుసుకుంటే... కొత్త దర్శకుడు నర్రా నాగేశ్వరరావు ప్రణయ్ అమృత లవ్ స్టోరీ ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి పల్లెటూరు నేపథ్యంలో ఓ సినిమా ని తీయగా... దానిని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మించాడు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ సినిమాలో ప్రధాన పాత్ర ని పోషించగా... అమృత ప్రణయ్ సినిమాకి 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' అనే టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ రోల్ లో మాస్టర్ రవితేజ నటించగా... ఇతర ప్రధాన పాత్రలలో నటి జామున, బాలాదిత్య, అర్చన నటించారు.



కొద్ది రోజుల్లోనే విడుదల కానున్న ఈ సినిమా గురించి హీరో బాలాదిత్య మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ప్రేమ కథ తో దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నాడు అని, ఐతే వారి ప్రేమకథకి కొంచెం సినిమాటిక్ టచ్ ని యాడ్ చేసారని, తన సరసన అర్చన నటించిందని, తన పాత్ర చిన్నదే అయినా తనకి మంచి గుర్తింపు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సినిమాని మినహాయించి బాలాదిత్య రాసాత్తి అనే తమిళ సీరియల్ లో నటిస్తున్నాడు. అలానే ఈయన తాజాగా గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఏది ఏమైనా ప్రణయ్ అమృతల లవ్ స్టోరీని ప్రజలు వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తారు అని భావించిన దర్శకుడు నాగేశ్వరరావు ఎక్స్పెక్టేషన్స్ ఎంత వరకు నిజం అవుతాయో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: