బూతు సినిమాల దర్శకుడుగా మొదట్లో ఒక ముద్ర వేయించుకున్న మారుతి ఆ తరువాత మారిపోయిన పరిస్థితులలో ‘భలే భలే మగాడివోయ్’ మూవీ తీసి తన పై ఏర్పడిన బూతు ఇమేజ్ ని తొలిగించుకున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన ‘ప్రతిరోజు పండగే’ మూవీ ఊహించని విజయం సాధించి 40 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ ను తెచ్చుకున్నా ప్రస్తుతం అతడిని టాప్ హీరోలు పట్టించుకోక పోవడమే కాకుండా కనీసం అతడు చెప్పే కథలను వినడానికి కూడ ఆసక్తి కనపరచడం లేదు అంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.


వాస్తవానికి మారుతి అల్లు అర్జున్‌ కి బాగా క్లోజ్ అయినప్పటికీ ఇంతవరకు అతడు చెప్పాలని ప్రయత్నిస్తున్న కథలను వినడానికి కూడ బన్నీ ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి. అమెరికా నుండి మహేష్ తిరిగి వచ్చిన తరువాత మహేష్ కు సరిపోయే ఒక కథ తన దగ్గర ఉంది అంటూ మారుతి సుధీర్ బాబు ద్వారా రామబారాలు చేసినా మహేష్ స్పందించలేదు అని టాక్. 


దీనితో ప్రస్తుతం మారుతికి మిడ్ రేంజ్ హీరోలు తప్ప మరో ఆప్షన్ లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి  ఈ మిడ్ రేంజ్ హీరోలు కూడ చాల బిజీగా ఉన్న పరిస్థితులలో మారుతి చెప్పే కథను వినే ఆసక్తి ఉన్నా వారెవ్వరూ ప్రస్తుతం మారుతికి అందుబాటులో లేరు అని అంటున్నారు. అయితే ‘రెడ్’ తర్వాత ఏ సినిమా చేయాలనేది రామ్ ఇంకా డిసైడ్ అవ్వని పరిస్థితులలో రామ్ కు ఒక కథ చెప్పాలని మారుతి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

అయితే ప్రస్తుతం రామ్ కు ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత అతడి ఇమేజ్ పూర్తిగా మారిపోవడంతో మారుతి మార్కు ఎంటర్‌ టైన్‌మెంట్ మూవీని చేస్తే జనం ఎంత వరకు ఆదరిస్తారు అన్న అనుమానం రామ్ ను వెంటాడుతోంది అని అంటున్నారు. దీనితో ఒక మంచి విజయం వచ్చిన తరువాత కూడ మారుతికి అవకాశాలు రాకపోవడంతో టాప్ హీరోలను మెప్పించే సమర్థత మారుతికి లోపించిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: