ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలలో నటించిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందాన గురించి ఏ చిన్న విషయం బయట పడినా అది పెద్ద వార్త కావడం గమనార్హం. గత కొన్ని రోజుల క్రితం తాను కుక్క బిస్కెట్లు టెస్ట్ చేసానని తన వింత అలవాటుని బయటపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన రష్మిక మందాన మళ్లీ ఇటీవల తన గురించి సరి కొత్త విషయాలను మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది.



ఆమె మాట్లాడుతూ... 'కొత్త పాత్రలలో నటించేందుకు నేను ఎక్కువగా ఆసక్తి చూపుతాను. అలాగే విభిన్నమైన పాత్రలు వచ్చినా నేను నో చెప్పను. ఒకవేళ ప్రయోగాత్మక క్యారెక్టర్లు చేయాల్సి వస్తే నేను నా యాక్టింగ్ స్కిల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడిప్పుడే నటన నేర్చుకుంటున్నాను కాబట్టి ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా భవిష్యత్తులో సరిదిద్దుకో గలను. డైరెక్టర్లు నాలోని నటన సామర్థ్యాన్ని ఎంత వాడుకుంటే అంత సంతోషం నాకు. అందుకే నా పాత్ర ఎంత శ్రమతో కూడినా, చాలెంజింగ్ గా ఉన్నా నేను ఆ రోల్ చేయడానికి సిద్దపడతాను. నా ప్రవర్తన నీటి లాగా ఉంటుంది. నీళ్లు అనేవి ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారంలోకి పర్ఫెక్ట్ గా మారుతాయి. నేను కూడా అంతే. నన్ను ఏ పాత్రలో నటించనమన్న ఆ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగి పోతాను. భవిష్యత్తులో నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా నటన నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలి', అని ఆమె చెప్పుకొచ్చింది.




ఇకపోతే ప్రస్తుతం బిజీగా ఉన్న రష్మిక మందనా అల్లు అర్జున్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే హీరో కార్తీ, ధ్రువ సర్జ తదుపరి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏదేమైనా ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీని మహారాణిలా ఏలుతుందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: