గత కొన్ని రోజులుగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో కొత్తదనం లేదని విమర్శలు వచ్చాయి. గతంలోలా కొత్తదనం కనిపించడం లేదనీ, పాత ట్యూన్లనే మళ్ళీ కొడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఆఖరికి సరిలేరు నీకెవ్వరు సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు దేవి. సరిలేరు సినిమాతో పోటీగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా పాటలు బాణాల్లా దూసుకెళ్తుంటే సరిలేరు పాటలు వాటి వేగాన్ని అందుకోలేకపోయాయి.

 

అల వైకుంఠపురములో సినిమాకి అంత బజ్ రావడానికి కారణం థమన్ అందించిన మ్యూజిక్కే కారణం. అలాంటి మ్యాజిక్ చేసే మ్యూజిక్ సరిలేరులో ఉండి ఉంటే దాని స్థాయి మరింత బాగా ఉండేదని చాలామంది అభిప్రాయ పడ్డారు. దాంతో దేవిశ్రీ పని అయిపోయిందని, ఇక మ్యూజిక్ చేయడం అవసరమా అని రోజూ వార్తలు వచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏరి కోరి ఎంచుకునే స్థాయి వారే వద్దనే స్థాయికి వచ్చాడు దేవి.

 

అయితే ప్రతీ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కి అలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి ఎదురవడం సహజమే. కానీ అలా అయిన తర్వాత మళ్లీ ఎంత తొందరగా లేచామన్నదే ముఖ్యం. ఆ విధంగా చూసుకుంటే దేవి చాలా తొందరగానే పైకి లేచాడు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలోని నీ కన్ను నీలి సముద్రం పాట విడుదలయి కోటి వ్యూస్ ని దక్కించుకుంది.

 

ఇప్పుడు ఇదే సినిమా నుండి మరో పాట రిలీజ్ కాబోతుంది. ధక్ ధక్ ధక్ అనే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. విడుదల చేసిన కొద్దిసేపట్లోనే చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ ప్రోమో. దీంతో దేవిపై విమర్శలు చేసినవాళ్ళు సైతం ఈ పాట విని అతనిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మొత్తానికి దర్శకుడు బుచ్చిబాబు సానా దేవిని బాగానే సానాబెట్టాడని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: