తెలుగు లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సాహస వీరుడు-సాగర కన్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.  ఆ తర్వాత బాలయ్య సరసన మరో చిత్రంలో నటించింది.  తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు తక్కువే అయినా.. మంచి క్రేజ్ సంపాదించింది శిల్పాశెట్టి.  స్వతహాగా యోగా గురువు అయిని శిల్పాశెట్టి తన ఫిట్ నెస్ కి సంబంధించిన ఎన్నో టిప్స్ సోషల్ మాద్యమాల ద్వారా నెటిజన్లతో పంచుకుంటుంది.  అంతే కాదు యోగా కు సంబంధించిన ఎన్నో వీడియోలు ఈమె రూపొందించింది.  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన శిల్పాశెట్టి ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా  ని వివాహం చేసుకుంది. 

 

ఈ మద్యే శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులు స‌మిశ అనే  పండంటి ఆడబిడ్డకి తల్లితండ్రులయ్యారు.  ఈ విష‌యాన్ని శిల్పా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్ స్ట్రామ్ లో పోస్ట్ చేసింది. 

 

ఫిబ్ర‌వ‌రి 15న స‌రోగ‌సీ ద్వారా శిల్పా శెట్టి స‌మీశాకి జ‌న్మ‌నివ్వ‌గా మంచి రోజు చూసుకొని ఫిబ్ర‌వ‌రి 21న అనౌన్స్ చేసింది. అయితే తన కూతురుకి సంబంధించిన ఎలాంటి పిక్స్ ఆమె షేర్ చేసుకోలేదు.  తాజాగా  రాజుకుంద్రా, శిల్పా శెట్టి దంప‌తులు కొడుకు  వియాన్‌, కూతురు స‌మిశ‌తో క‌లిసి ఫోటోల‌కి ఫోజులిచ్చారు.  శిల్పా శెట్టి వెండి తెరపైనే కాదు రియల్ లైఫ్ లో కూడా తన అందమైన కుటుంబంతో ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: