రెజీనా కెసాండ్రా.. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ భామ ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. రారా క్రిష్ణయ్య, జ్యో అచ్యుతానంద, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో హీరోయిన్ గా మంచి పేరు వచ్చినప్పటికీ ఆ సినిమాలు మరిన్ని అవకాశాలని మాత్రం తీసుకురాలేకపోయాయి. అయితే హీరోయిన్ రెజీనా పని అయిపోయిందనుకుంటున్న టైమ్ లో అ! సినిమాలో ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.

 

అ! తర్వాత ఆమె నటించిన థ్రిల్లర్ ఎవరు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనా ఫీమేల్ లీడ్ పాత్రలో నటించి మెప్పించింది. అవకాశాలు లేని టైమ్ లో ఎవరు సినిమా ఆమె కెరీర్ కి మంచి ఊతమిచ్చింది. మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకుడిని సీటు అంచుమీద కూర్చోబెట్టగలిగింది. అయితే ప్రస్తుతం రెజీనా మరో థ్రిల్లర్ చిత్రంలో నటిస్తుంది.

 

నేనే నా అనే చిత్రంలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. ఆ చిత్ర ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. అయితే అటు ఫీమేల్ లీడ్ గా అవకాశాలు వస్తున్నా గానీ, హీరోయిన్ గా అవకాశాలు పలకరించడం లేదు. అయితే ప్రస్తుతం ఆమెకి మరో అద్భుతమైన అవకాశం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో రెజీనా చిరంజీవితో స్టెప్పులు వేయనుంది. ఖైదీ నంబర్ 150 సినిమాలోలా ఈ పాట కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుందట. ఈ పాటని రెజీనా సెలెబ్రేషన్ సాంగ్ అని పిలుస్తుందట. ఇంకా ఈ పాట గురించి మాట్లాడుతూ చిరంజీవి గారితో డాన్స్ చేయడం తన అదృష్టమని చెప్పింది. ఇంకా మళ్లీ ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేస్తారా అని అడగ్గా.. అస్సలు చేయనని, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: