అక్కినేని అఖిల్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. సమ్మర్ లో విడుదల కానున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు బన్నీ వాసు, వాసువర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మొదటి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. "మనసా.. మనసా..." అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరచగా సురేందర్ కృష్ణ సాహిత్యాన్ని అందించారు. యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

 

తన మనసుని అదుపు చేసుకునేందుకు ఒక బ్యాచిలర్ కుర్రాడు చేసే ప్రయత్నంలో భాగంగా "మనసా... మనసా... వలలో పడబోకే మనసా..." అంటూ సాగిన ఈ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. వయస్సులో ఉండే కుర్రాడికి నచ్చిన అమ్మాయి కనిపిస్తే తన మనసు మనసులో నిలవదనే భావంతో "పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెళతావే మనసా..." అంటూ మనసు అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఈ పాట ద్వారా తెలుస్తుంది.

 

ఈ పాట యూట్యూబ్ లో విడుదలైన తక్కువ టైంలోనే మిలియన్ల వ్యూస్ సొంత చేసుకొని సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి పాటే మంచి ఆదరణ పొందడంతో అభిమానులు రెండవ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుండి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ మరియు బొమ్మరిల్లు భాస్కర్ లకు ఈ పాట విజయం నూతన ఉత్సాహమిచ్చిందని చెప్పవచ్చు. గోపీసుందర్ స్వరపరిచిన అద్భుతమైన ప్రేమ బాణీలలో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. ఈ సాంగ్ సినిమా సక్సెస్ లో ముఖ్యపాత్ర పోషిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి ఈ  సినిమా అయినా అక్కినేని అబ్బాయికి కలిసి వస్తుందా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: