సినీనటుడు, జనసేన నేత నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ.. ఏదో ఒక వార్తల్లో నిలుస్తుంటారు ఈయన. అయితే.. ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పై గురించి స్పందిస్తూ..  ఏపీ ప్రజల్ని టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు టాల్ స్టార్ నాగబాబు. 

 

ఆయన ట్వీట్ లో ఏమన్నారంటే.. లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్ళని అధికార ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు. ఏమిటో ఈ పిచ్చి జనం. దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్) అంటూ.. ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ వదిలారు.

 

నాగబాబు పరోక్షంగా ఏపీ ప్రజలకు లైఫ్ ఇస్తానన్న పవన్ కల్యాణ్‌ ను ఎన్నికల్లో ప్రజలు ఓడించారని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే.. వైసీపీ, టీడీపీ లను అధికార ప్రతిపక్షలుగా ఎన్నుకున్నారని దాంతో పాటుగా చెప్పారు. వచ్చే కొత్త తరాల కోసమైనా.. ఈ జనం మనసు మార్చు అంటూ దేవున్ని ప్రార్థిస్తూ నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశారు.

 

కాగా., టాల్ స్టార్ నాగబాబు ట్వీట్‌ కు బాబు అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నాగబాబును కొందరు నువ్వు కేక అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎన్నికలకు కనీసం 6 నెలల ముందు కూడా మీరు.. మీ తమ్ముడు కష్టపడలేదు అంటూ బాబును నిలదీస్తున్నారు. ఇంకొంత మంది అయితే.. మీ చేతకాని తనాన్ని జనం పై రుద్దకండి మాస్టారు అంటూ నాగబాబుకు చురకలంటించారు. జనసేనను గెలిస్తేనే జనాలు మంచోళ్లు లేకుంటే మంచోళ్లు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.  కొన్ని జీవితాలు అంతే మరి మారవు సార్ అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: