టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అనేది చాలా మంది యువ దర్శకుల. ఆయనతో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చాలు పండగ చేసుకుంటారు దర్శకులు. ఆయనతో సినిమా చెయ్యాలి అంటే రాసి పెట్టి ఉండాలి అనుకుంటారు. చిరంజీవి వయసులో ఉన్నప్పుడు అయినా ఇప్పుడు అయినా సరే ఆయనకు ఉండే క్రేజ్ ఆ రేంజ్ లో ఉంటుంది అనే మాట వాస్తవం, ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మలయాళం రీమేక్ లూసిఫర్ లో చేస్తున్నారు చిరంజీవి. 

 

సినిమా కోసం ఇప్పుడు నిర్మాత రామ్ చరణ్ దర్శకులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ముందు ఈ సినిమా కోసం వీవి వినాయక్ పేరుని చిత్ర యూనిట్ పరిశీలించింది. మరి తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని వెనక్కు తగ్గారు. చిరంజీవే వద్దని చెప్పారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతను ఇద్దరు యువ దర్శకులకు చిరంజీవి అప్పగించారని అంటున్నారు. బాబీ, సుజిత్ ఇద్దరికీ ఈ అవకాశం వచ్చిందని టాలీవుడ్ వర్గాల మాట. అయితే లూసిఫర్ కథ ను తెలుగులో ఎవరు బాగా చూపిస్తే వారికే అవకాశం ఇస్తారట. 

 

తెలుగుకి తగ్గట్టు ఆ కథను మార్చాలని ఎవరి కథ బాగుంటే వారికి అవకాశం ఇస్తా అని చిరంజీవి చెప్పడంతో ఇప్పుడు ఈ కథను తెలుగులోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ అయింది. చిరంజీవితో సినిమానే ఒక అద్రుష్టం. మరి ఈ తరుణంలో కథను వాళ్ళు ఏ విధంగా మారుస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం ఇద్దరు దర్శకులు వేరే పనులు ఆపి ఈ సినిమా మీద ఫోకస్ చేసారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవిసినిమా చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: