యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇకపోతే దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు ఇటీవల ఒక అధికారిక ప్రకటన రావడం జరిగింది. 

 

గతంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా ఎంతో గొప్ప క్రేజ్ సంపాదించిన నాగ అశ్విన్, ప్రభాస్ తో చేయబోయే సినిమా కథ విషయమై ఎంతో జాగ్రత్త వహిస్తున్నారట. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ సైన్స్ ఫిక్షన్ జానర్లో సాగుతుందని సమాచారం. అలానే అదే జానర్ లో సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇప్పటి వరకు రాని ఒక సరికొత్త పాయింట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని ఎంతో పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారట. 

 

దాదాపుగా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా మూవీ గా భారతదేశంలోని పలు ప్రముఖ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్, ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించి, సినిమాని వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ప్రభాస్, నాగ అశ్విన్ ల కలయికలో సూపర్ హిట్ ఖాయమని ఆయన రెబల్ ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: