సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', 'మహర్షి', 'భరత్ అనే నేను' చిత్రాలతో రికార్డు కలెక్షన్స్ సొంతం చేసుకొని 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజిలో ఉంటుందో మన అందరికీ తెలిసిందే. కానీ బాబు డామినేషన్ అక్కడా ఇక్కడా అని కాదు ఎక్కడైనా సరే 'సరిలేరు నీకెవ్వరూ' అనాల్సిందే. మహేష్ కెరీర్ లో రికార్డ్ కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో “భరత్ అనే నేను”, “బిజినెస్ మేన్” సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

 

వీటిలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బిజినెస్ మెన్' సినిమా ఆ రోజుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సెన్సేనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు మేనరిజమ్స్ ఇప్పుటి కుర్రకారు కూడా ఇమిటేట్ చేస్తుంటారు. అలానే మహేష్ బాబు కెరీర్ లో గుర్తుండి పోయే సినిమాల్లో దర్శకుడు కొరటాల శివతో తీసిన 'భరత్ అనే నేను' కూడా ఒకటి. ఈ చిత్రం మనదేశంలోనే కాక ఓవర్ సీస్లో కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించింది.

 

అయితే ఇప్పుడు మహేష్ నటించిన ఈ రెండు చిత్రాలే స్ట్రీమింగ్ దిగ్గజాలు 'అమెజాన్ ప్రైమ్' మరియు 'సన్ నెక్స్ట్' యాప్ లలో అత్యధిక వ్యూస్ సంపాదించిన తెలుగు చిత్రాలుగా మన దక్షిణాది నుంచి నిలిచాయి. అమెజాన్ ప్రైమ్ లో 'భరత్ అనే నేను' ఇప్పటి వరకు 44 మిలియన్ల వీక్షణలతో ఆల్ టైం టాప్ 4లో నిలవగా సన్ నెక్స్ట్ లో 'బిజినెస్ మేన్' 5.4 మిలియన్ల వీక్షణాలతో టాప్ 3లో నిలిచింది. మన తెలుగు నుంచి ఇలా రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు ఒక్కరే కావడం విశేషం. మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అభిమానులు ఉండడంతో ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. కాగా మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తుండగా, కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: