అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర మహానటి సినిమా గా తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ నాగ అశ్విన్ కి మంచి పేరు రావడం జరిగింది. ఆ టైం లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మహామహులు ప్రముఖులు నాగ్ అశ్విన్ దర్శకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఖచ్చితంగా నాగ అశ్విన్ తో సినిమా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి కి స్టోరీ వినిపించటం జరిగిందట.

 

అయితే ఆ స్టోరీ లో ఉన్న క్యారెక్టర్ చాలా హై రేంజ్ నటన కలిగిన పాత్ర కావడంతో తాను చేయలేనని చిరంజీవి చేతులెత్తేశారు అని సమాచారం. కానీ అదే ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ ప్రభాస్ కి తెలియజేయడంతో ప్రభాస్ ఒకే అన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. భారీ బడ్జెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ‘సైరా’ సినిమా ఎఫెక్ట్ తో అదే టైపు లో ఈ సినిమా ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి నో చెప్పారు అన్న టాక్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.

 

కాగా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా విజయం సాధించిన తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని...భారీ బడ్జెట్ అంటే ప్రభాస్ సినిమాలు ఓకే చేస్తుండటంతో..సినిమాలో క్యారెక్టర్ దాని గురించి సరైన ఎనాలసిస్ చేయకుండా ప్రభాస్చిరంజీవి లాగా ఆలోచించకుండా ఓకే చేయడం వల్ల చాలా నష్టపోతున్నారని, తాజాగా నాగ్ అశ్విన్ సినిమా ఓకే చేయడం పట్ల ఫిలింనగర్లో కామెంట్లు వినబడుతున్నాయి. ఈ విధంగానే ‘సాహో’ సినిమా చేయటంతో ప్రభాస్ రెండు సంవత్సరాల టైం తో పాటుగా భారీ ఫ్లాప్ చూడాల్సి వచ్చిందని కూడా కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: