డార్లింగ్ వినింది మెగాస్టార్ విన్న కథేనట. ఈ ఏజ్ లో చిరంజీవి అంతా రిస్క్ చేయలేను అనుకున్నాడా.. లేక ప్రభాస్ ఫర్ ఫెక్ట్ అని చెప్పాడా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా మెగాస్టార్ ఓ వండర్ ఫుల్ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నట్టు వినిపిస్తోంది. 

 

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ తో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు. 400కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ అంటూ మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. అశ్వనీదత్ ఈ సినిమా నిర్మాణ సన్నాహాల్లో మునిగిపోయాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఈ కథను నాగ అశ్విన్ ముందు మెగాస్టార్ చిరంజీవికి చెప్పాడని టాక్. 

 

నాగ అశ్విన్, మెగాస్టార్ తో చేయాలని సిద్ధం చేసిన స్క్రిప్టునే ప్రభాస్ తో చేస్తున్నాడని టాక్. మరి ఇందులో నిజమేంత అనేది తెలియడం లేదు. ఆద్యంతం రక్తి కట్టించే సైన్ ఫిక్ష్ కథతో నాగ అశ్విన్ వండర్ ఫుల్ నేరేషన్ తో ప్లాన్ చేస్తున్నాడట.

 

భారీ యాక్షన్ సన్నివేశాలకు, థ్రిల్లింగ్ మూమెంట్స్ సినిమాలో ఉంటాయని టాక్. ఈ సినిమా కోసం కనీసం ఏడాదిన్నర సమయం పడుతోందట. ఈ కారణంతోనే చిరంజీవి సినిమా నుండి తప్పుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. 

 

సైరా కోసం చిరంజీవి రెండేళ్లు డేట్స్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం రెండేళ్లు కేటాయించడం తన వల్ల కాదనే ఉద్దేశ్యంతోనే చిరు, నాగ అశ్విన్ కి నో చెప్పాడని ఓ టాక్. ఈ క్రమంలోనే కథకు ప్రభాస్ పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడని మెగాస్టార్ సజెస్ట్ చేసినట్టు వినికిడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను జూన్ నుంచి మొదలు పెడతారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: