సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు, మొన్నటి సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తన సినిమా కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు, ఒక ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక హీరోయిన్ గా నటించగా, సీనియర్ నాయిక విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళి సరిలేరు సక్సెస్ ని ఎంజాయ్ చేసి వచ్చిన మహేష్, అతి త్వరలో హిమాలయాలకు టూర్ వెళ్లనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ఇప్పటికే మహేష్ మెగాస్టార్, కొరటాల మూవీ లో ఒక కీలక పాత్ర చేయడానికి మహేష్ ఒప్పుకున్నారని, అలానే దాని తరువాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆ విషయాలు అటుంచితే, చాలారోజుల నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఒక క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్, వీరిద్దరి కాంబోలో లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల్లో అతడు సూపర్ హిట్ కొట్టగా, ఖలేజా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ కూడా అతడుతో పాటు ఖలేజా ఇప్పటికీ కూడా టివి ఛానల్స్ లో ప్రదర్శితం అయి మంచి రేటింగ్స్ ని సాధిస్తూ ఉంటుంది. 

 

ఇక వారిద్దరి కాంబోలో సినిమా వచ్చి పదేళ్లు దాటుతుండడంతో మరొక్కసారి వారిద్దరూ కలిసి ఎప్పుడు పని చేస్తారా అని, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అతి త్వరలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న త్రివిక్రమ్, దాని అనంతరం మహేష్ తో నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ పాటికి త్రివిక్రమ్ తో మహేష్ ఒక సినిమా చేసి ఉండాల్సిందని, అయితే కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదని అంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: