పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఆ తర్వాత సినిమాలు మానేస్తున్నా అన్న స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆ స్టేట్ మెంట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అందుకే ఆ మరుసటి రోజునుంచే బాస్ మళ్ళీ సినిమాలు చేయాలని కనపడిన ప్రతీ చోటా బలవంత పెడుతూనే ఉన్నారు. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు కొన్నాళ్ళు హాట్ టాపిక్ అయ్యాయి గాని నిజం కాదని అందరూ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ షాకిచ్చారు. బాలీవుడ్ ‘పింక్’ సినిమా రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ కి కిక్ ఇచ్చారు. 

 

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ నటించిన పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ ఒప్పుకొని అందరూ అవాక్కయ్యోలా చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కమర్షియల్ సినిమాలలో నటించారు. కాని పింక్ రీమేక్ వకీల్ సాబ్ మాత్రం మెసేజ్ ఓరియొంటెడ్ సినిమా. సమాజంలో ఆడవాళ్ళు  ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానాంశంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. హిందీలో ఎలా తీశారో తమిళంలోను ఉన్నది ఉన్నట్లుగా మక్కీకి మక్కీగా అజిత్ తో రీమేక్ చేశారు. తమిళంలో కూడా మంచి సక్సస్ ని అందుకుంది.

 

అయితే తెలుగులో అలా వర్కౌట్ కాదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ పక్కా కమర్షియల్ హీరో. కాబట్టి సినిమాను కమర్షియల్ గా భారీగా బిజినెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినట్టుగా వకీల్ సాబ్ పోస్టర్ తోనే అనుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ కు పింక్ లో అమితాబ్ రోల్ కు చాలా తేడాలు ఉంటాయట. కమర్షియాలిటీ కోసం పవన్ పాత్రని చాలా మార్చారట. అయితే ఈ మార్పులు వర్కౌట్ అవుతాయా .. కథలో అసలు విషయం ఎలివేట్ అవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయట. మరి నిజంగా కమర్షియాలిటీ కోసం చేసిన మార్పులు చేర్పులు సినిమాకి ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: