ఒకానొక సమయంలో దక్షిణాది సినిమా రంగంలో వరుస అవకాశాలు దక్కించుకుంది కాజల్ అగర్వాల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే విజయాన్ని మొదటి సినిమాతోనే అందుకొంది. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుని ఇండస్ట్రీ హిట్ అందుకుంది. 'మగధీర' విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోల అందరి పక్కన నటిస్తూ అదిరిపోయే విజయాలు తన ఖాతాలో నమోదు చేసింది. అంతేకాకుండా ఒక తెలుగులో మాత్రమే కాక దక్షిణాది సినిమా రంగంలో పలు భాషల్లో నటించిన కాజల్ అగర్వాల్ అదిరిపోయే పాపులారిటీ సంపాదించింది.

 

దీంతో రోజురోజుకూ క్రేజ్ పెరగటంతో ఈ ముద్దుగుమ్మ కన్ను బాలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది. దాంతో సౌత్ ఇండస్ట్రీ లో వచ్చిన అవకాశాన్ని వదులుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేయటం జరిగింది. కానీ ఒక్క సినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ఇటువంటి తరుణంలో లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ వైపు చూసి ప్రస్తుతం కెరియర్ కొనసాగిస్తోంది. అయితే తాజాగా కమెడియన్ అల్లరి నరేష్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

కొరియాలో రూపొందిన “డ్యాన్సింగ్ క్వీన్” అనే మూవీని తెలుగులో రానా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి కాజల్ ని ఫైనల్ అనుకున్నారట. అందుకే ఆమెని ఒప్పించారని సమాచారం. అయితే, ఆమెకి హీరోగా ఇప్పుడు అల్లరి నరేష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. కథ ప్రకారం కామెడీ చేసే హీరో అయితేనే బాగుంటుంది. దీనితో నరేష్ వైపు చూస్తున్నారు.  అంతే కాకుండా వెబ్ సిరీస్ లో సినిమా చేయాలని సంచలన నిర్ణయం కాజల్ అగర్వాల్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: