టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు మంచి పేరు ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు దివంగత రామానాయుడు అనేక భాషలలో అత్యధిక సినిమాలు నిర్మించి గిన్నిస్ రికార్డ్ కూడా సాధించిన ఘనత ఉంది. ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించడమే కాకుండా 'మూవీ మొగల్' అన్న పేరుని కూడా సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో బడ్జెట్ పెరిగి పోవడంతో పాటు కోట్ల రూపాయల రెమ్యునిరేషన్ హీరోలు తీసుకోవటంతో సినిమా రంగంలో వ్యవహారం అంతా ఇప్పుడు మారిపోయింది. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు సినిమాలు నిర్మించడానికి నానా యాతన పడుతున్నారు.

 

అంతే కాకుండా సినిమా రెమ్యునిరేషన్ తో పాటు సినిమా హిట్ అయితే దానిలో లాభాలు కూడా తీసుకుంటున్నారు హీరోలు. ఇటువంటి పరిస్థితుల్లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థని దగ్గరుండి నడిపిస్తున్న సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా కోసం ఇబ్బంది గానే డబ్బు ఖర్చు పెడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే రాణా హీరోగా సురేష్ బాబు “విరాట పర్వం” సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం మొట్టమొదటి సారి సురేష్ బాబు బారి ఖర్చుకి వెనుకాడకుండా హాలీవుడ్ టెక్నిషియన్స్ తో యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ పని చేస్తున్నాడు.

 

ఇక ఈ సినిమాకు కెమెరామన్ కూడా హాలీవుడ్ కు చెందిన దాని సాంచెజ్ లోపెజ్ పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను వేణు ఉడుముల దర్శకత్వం వహిస్తుండగా రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తనయుడు రానా మీద నమ్మకంతో సురేష్ బాబు ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా “విరాట పర్వం” సినిమా విజయం కోసం తెగ ఆరాటపడుతున్నారు అట...దీంతో ఎప్పుడూ ఖర్చు చేయని సురేష్ బాబు ప్రస్తుతం డబ్బులు బాగా తీయడంతో ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ చర్చనీయాంశంగా మారింది. వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: