చిరంజీవి, కొరటాల సినిమా ఆచార్య అటు మెగా ఫ్యాన్స్ ను.. ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను గందర గోళానికి గురిచేస్తోంది. ఈ మూవీలో అతిథి పాత్రలో రామ్ చరణ్ నటిస్తాడా.. లేదంటే మహేశ్ నటిస్తాడా.. అనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయంపై హీరో డైరెక్టర్ మధ్య తర్జనభర్జనలు జరుగుతున్నా.. ఇంకా క్లారిటీ రాలేదు. అరగంట ఉండే ఈ పాత్ర ఎందుకు డిస్టర్బ్ చేస్తోంది. 

 

ఏమైనా డౌట్స్ వస్తే తీర్చాల్సిన ఆచార్య సమస్యలు సృష్టిస్తున్నాడు.  అరగంట సేపు ఉండే ముఖ్య పాత్ర కోసం ముందుగా చెర్రీ అనుకున్నారు. ట్రిపుల్ ఆర్ కోసం మీసాలు దట్టంగా పెంచిన చెర్రీ.. ఆచార్య లుక్ కోసం మార్చాల్సి వచ్చిందట. అందుకే సినిమా వదులుకున్నాడట. 

 

ఆచార్యలో రామ్ చరణ్ కన్నా మహేశ్ బెటర్ అనే ఫీలింగ్ లో కొరటాల ఉన్నాడు. ఇద్దరు మెగా హీరోలు ఒకే సినిమాలో ఉండే దానికంటే.. మహేశ్ కలిస్తే.. అంచనాలతో పాటు బిజినెస్ పెరుగుతుందన్న నమ్మకంతో దర్శకుడు ఉన్నాడు. 

 

ఆల్ రెడీ కొరటాల మహేశ్ కు కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఓకే అనలేదట. ఆచార్య గెస్ట్ రోల్ లో ఎవరు కనిపిస్తారు.. మహేశా.. రామ్ చరణా.. ఈ ప్రశ్న చిరంజీవి అండ్ పార్టీని కన్ ఫ్యూజ్ చేస్తోంది. గతంలో కొరటాల రామ్ చరణ్ సినిమా మొదలై కథ విషయంలో పూర్తి సంతృప్తి కలుగకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. 

 

ఆచార్య తర్వాత కొరటాల రామ్ చరణ్ ను డైరెక్ట్ చేస్తాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఆచార్యలో మహేశ్ నటిస్తేనే.. రామ్ చరణ్ మూవీ చేస్తానన్న కండీషన్ దర్శకుడు పెట్టాడనేది లేటెస్ట్ న్యూస్.  చివరకు ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి. కానీ ఇటు మెగాస్టార్ అభిమానులు.. ఇటు మహేశ్ బాబు అభిమానులు ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: