మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ప్రదర్శిస్తున్న తెలివితేటలను చూసి ఏకంగా చిరంజీవి పవన్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న తన మొదటి సినిమా ‘ఉప్పెన’ ప్రమోషన్ ను అప్పుడే ఈ యంగ్ హీరో మొదలు పెట్టేసాడు. 


నిన్న విడుదలైన ఈమూవీలోని ‘ధక్ ధక్ ధక్’ సాంగ్ హిట్ కావడంతో ప్రస్తుతం వైష్ణవ్ మంచి జోష్ లో ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు తన మెగా ఫ్యామిలీ మాస్ హీరో ఇమేజ్ ని కొనసాగించడానికి ఒక సెలూన్ గట్టు పై కూర్చుని ఉన్న స్టిల్ ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసారు. 


ఈ సెలూన్ తలుపుల పై ఒకవైపు పవన్ మరొక వైపు చిరంజీవి లకు సంబంధించిన పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పడు ఈ ఫోటో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తమకు ఆంధ్రా తెలంగాణాలు రెండు కళ్ళు అంటూ సమన్యాయం పాటించారు.


ఇప్పుడు రాజకీయాల స్పెలింగ్ కూడ తెలియకుండానే వైష్ణవ్ తేజ్ ఒకేసారి పవన్ చిరంజీవిల అభిమానులను బుట్టలో వేసుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఈ యంగ్ హీరో తెలివి తేటలను సూచిస్తున్నాయి. అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీతో పోటీగా ఏప్రిల్ రెండున విడుదల కాబోతున్న ‘ఉప్పెన’ చేస్తున్న సాహసం చూసి వైష్ణవ్ తేజ్ ఇంత సాహసం అప్పుడే వచ్చిందా అంటూ షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ఏ హీరోకి అయినా అతడి సినిమాకు సంబంధించి ఓపెనింగ్ కలక్షన్స్ కీలకంగా మారుతున్న పరిస్థితులలో ఈ యంగ్ హీరో ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నాడు అనుకోవాలి. ఈ సినిమాలో క్రితి శెట్టి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. చిరంజీవి ‘ఆరాధన’ మూవీలోని కొన్ని సీన్స్ పోలిక ‘ఉప్పెన’ లో కనిపిస్తాయి అన్న ప్రచారం జరుగుతోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: