ప్రభాస్ నాగ్ అశ్విన్మూవీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో సుమారు 400 కోట్ల ఖర్చుతో తీయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ ఓకె కావడంతో ఈ సినిమాలో నటించబోయే కీలక నటీనటుల ఎంపిక పై దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ల మధ్య కీలక చర్చలు కొంత వరకు జరిగినట్లు సమాచారం.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రభాస్ ఆలోచనలు ఒకలా ఉంటే నాగ్ అశ్విన్ ఆలోచనలు మరోలా ఉన్నాయి అని తెలుస్తోంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను ఎంపిక చేయమని ప్రభాస్ నాగ్ అశ్విన్ కు సలహా ఇచ్చాడు అని టాక్.


వాస్తవానికి ‘సాహో’ నిర్మాణ సమయంలో కూడ ప్రభాస్ ఆ మూవీకి హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను పెట్టమని దర్శకుడు సుజిత్ కు సలహా ఇచ్చినా సుజిత్ మాత్రం పట్టుబట్టి ‘సాహో’ శ్రద్దా కపూర్ ను ఆ మూవీలో హీరోయిన్ గా నటించే విషయంలో ప్రభాస్ ను ఒప్పించాడు అని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ కు కత్రినా పై ఉన్న అభిమానం తీరకపోవడంతో మళ్ళీ నాగ్ అశ్విన్ వద్ద కత్రినా ప్రస్తావన తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రస్తుతం కత్రినాకు క్రేజ్ తగ్గడంతో ఆమె బదులు ఈ మూవీ హీరోయిన్ గా కియారా అద్వాని పూజా హెగ్డే లలో ఎవరో ఒకర్ని ఎంపిక చేద్దాము అని చెప్పి ప్రభాస్ ను ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కత్రినా టాప్ హీరోయిన్ అవ్వకముందు వెంకటేష్ బాలకృష్ణ లతో చాల సంవత్సరాల క్రిందట సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె హవా బాలీవుడ్ లో పూర్తిగా తగ్గిన పరిస్థితులలో ప్రభాస్ కు లేటెస్ట్ గా కత్రినా పై అభిమానం కలగడం ఒక విధంగా షాకింగ్ న్యూస్ అనుకోవాలి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: