సాహో తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్  ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తన 20వ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియా లో జరుగుతుంది అందులో భాగంగా తాజాగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల ఆద్వర్యంలో ఛేజ్ సీక్వెన్స్ ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమా నుండి ఉగాది రోజు మార్చి 25న  రెండు ఫస్ట్ లుక్ లు విడుదలకానున్నాయని సమాచారం. అందులో ఒకటి ప్రభాస్ ఫస్ట్ లుక్ కాగా మరొకటి హీరోయిన్ పూజా హెగ్డే  ఫస్ట్ లుక్ వీటితోపాటు టైటిల్ కూడా చెప్పనున్నారు. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. 
 
ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు, రిద్దీ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది దసరా కు ఈ చిత్రాన్ని విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో తోపాటు ఈ చిత్రం తమిళ ,హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.  
 
ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించడానికి ఓకే చెప్పాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్ ఈచిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్ళి వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్  ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: