ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ప్ర‌స్తుతం డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ పైన ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. దాని కోసం చాలా సీరియ‌స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇక దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క్రేజీ హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌ని దించారు. ఇక డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ ఇప్పుడు ప్ర‌స్తుతం సినిమాని శాసిస్తోంది. దీంతో స్టార్స్ చాలా వ‌ర‌కు వెబ్ సిరీస్‌ల బాట ప‌డుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, మ‌నోజ్ బాజ్‌పాయ్ వంటి వాళ్లు వెబ్ సిరీస్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించి స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో కూడా ఈ సంప్ర‌దాయం ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. ఇదిలా వుంటే తెలుగులో మొట్ట‌మొద‌టి డిజిటల్ ఓటీటీని ఇటీవ‌లే అల్లు అర‌వింద్ మొద‌లుపెట్టారు.

 

అయితే దీనికి మాత్రం ఆయ‌న‌ అనుకున్న స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో అల్లు అర‌వింద్ దీనికోసం పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల‌ను రంగంలోకి దింపేస్తున్నారు. మైహోమ్ గ్రూప్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు వ‌న్ ఆఫ్ ది భాగస్వామిగా వ్యవ‌హ‌రిస్తుండ‌టంతో రెమ్యున‌రేష‌న్‌ల బాధ‌లేదు కాబ‌ట్టి సుకుమార్‌, వేణు ఊడుగుల‌, సుధీర్‌వ‌ర్మ‌ల‌ని రంగంలోకి దించేస్తున్నారు. ఊహించిన స్థాయికి మించి ఓటీటీ రీచ్ కావాలంటే అల్లు అర్జున్ అవ‌స‌రం అని భావించిన అల్లు అర‌వింద్ ఆఖ‌రికి బ‌న్నీని సైత‌కం వ‌ద‌ల‌డంలేదు. బ‌న్నీతో కూడా  ఓ క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్‌ని ప్లాన్ చేశార‌ట‌.

 

దీని చిత్రీక‌ర‌ణ బాధ్య‌త‌ల్ని త్రివిక్ర‌మ్‌కు అప్ప‌గించార‌ట‌. ఈ యాడ్‌లో `రొమాంటిక్‌` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న కేతిక శ‌ర్మ కూడా న‌టించ‌నుంద‌ని తెలిసింది. మ‌రి బుధ‌వారం నుంచి ఈ యాడ్‌ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ యాడ్ ఫిల్మ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా ఓ సెట్‌ని కూడా వేశార‌ట‌. బ‌న్నీ ప్ర‌చారం `ఆహా`కు ఏ స్థాయిలో క‌లిసి వ‌స్తుందో చూడాలి. ఇక ఆయ‌న క్రేజ్ మొత్తం `ఆహా` కోసం ఉప‌యోగిస్తార‌న‌మాట‌. మొత్తానికి అర‌వింద్ బాగానే ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: