మిడ్ రేంజ్ హీరోలలో నానికి ప్రత్యేకమైన స్టార్డమ్ ఉందని ప్రతీ ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. నాని చేసే సినిమాలకి మినిమమ్ వసూళ్ళు గ్యారెంటీ అని ఎప్పుడో తేలిపోయింది. అయినా కూడా ఇప్పటికీ అటు స్టార్ హీరో స్టేటస్ కి వెళ్ళకుండా మిడ్ రేంజ్ హీరోల్లోనే టాప్ గా ఉండిపోతున్నాడు. మొన్న నాని గ్యాంగ్ లీడర్ అంతగా విజయం సాధించకపోవడంతో ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న వి సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

 

 

 

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిందని సమాచారం. ఇటీవల రిలీజైన వి టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని, సుధీర్ బాబు ఇద్దరూ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. నాని మొదటిసారిగా నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాని మార్చ్ 25వ తేదీన ఉగాది కానుకగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం విడుదల విషయంలో నానీకీ, దిల్ రాజుకి మధ్య చర్చలు జరుగుతున్నాయట.

 

 

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల జనాలు థియేటర్లకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఈ భయాందోళనలు ఉన్నన్ని రోజులు ఎక్కడికీ వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని భావిస్తున్నారు. అందువల్ల మార్చ్ 25న సినిమాని రిలీజ్ చేసే బిజినెస్ పరంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఉద్దేశ్యంతో కరోనా గురించి పూర్తిగా భయం దూరమైన తర్వాత సినిమాని విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట.

 

 

కానీ నాని మార్చ్ 25వ తేదీనే విడుదల చేయాలని పట్టుబడుతున్నాడట. సినిమాకి మీద తనకి ఉన్న నమ్మకం ఆధారంగా ఖచ్చితంగా జనం వి సినిమాని ఆదరిస్తారని చెప్తున్నాడట. ప్రస్తుతానికైతే వీరిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయట. మరి వీరిద్దరిలో ఎవరి వాదన గెలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: