మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయమై ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ రాలేదు. వంశీ పైడిపల్లితో సినిమా క్యాన్సిల్ అయిందని తెలిసినప్పటి నుండి ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. మహర్షి సినిమా విజయం తర్వాత వంశీకి, మహేష్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, ఆ స్నేహం కారణంగానే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని వార్తలు రావడమే కాదు అధికారికంగా ప్రకటించారు కూడా.

 

కానీ సరిలేరు హిట్ అయిన తర్వాత వంశీ చెప్పిన పూర్తి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి మరో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడని, ఆ మరో సినిమాని గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో కథ ఓకే అయిపోయిందని, ఫలానా అంశంపైనే ఈ సినిమా ఉంటుందని కథ గురించి కూడా లీకులు వచ్చాయి.

 

 

కానీ ఎన్ని వచ్చినా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంది. జనాలకే కాదు అటు వాళ్ళిద్దరిలోనూ ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుందట. పరశురామ్ మహేష్ ఓకే చెబితే నాగచైతన్యతో అంతకుముందు ఓకే అయిన చిత్రాన్ని పక్కనపెట్టి మహేష్ చిత్రం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మరి మహేష్ పరశురామ్ తో చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాడట.

 

ఈ కన్ఫ్యూజన్ లు అన్నీ క్లియర్ అయిపోయి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందా లేదా అనేది సందేహంగా ఉంది. మరి ఈ గందరగోళం ఇప్పట్లో క్లియర్ గా అయ్యేలా కనబడట్లేదు. మహేష్ గానీ, పరశురామ్ గానీ స్పందిస్తేనే ఏ విషయం అనేది క్లియర్ అవుతుంది. అలా క్లియర్ కావాలంటే ముందు వాళ్లు క్లియర్ గా ఉండాలి. మరి తొందరలోనే ఆ అప్డేట్ వస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: