తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహెూ’ చిత్రంలో నటించాడు.  పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కినప్పటికీ  ఫ్లాప్ టాక్ రావడంతో ప్రభాస్ భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు.  అయితే ఈ మూవీ బాలీవుడ్ లో కాస్త పరవాలేదు అనిపించింది.   ఈ చిత్రం కోసం రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేశారని  వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  జాతీయ స్థాయిలో బాహుబలి తో క్రేజ్ సంపాదించిన ప్రభాస్ ఈ చిత్రంతో డీలా పడ్డారు. 

 

ఇక నుంచి భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఆ మద్య ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ నిర్మించిన విషయం తెలిసిందే.  ఇక్కడ  కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది.  ఈ చిత్రం ఓ అందమైన ప్రేమ కథ అని.. ఇందులో ప్రభాస్ కోటీశ్వరుడిగా నటిస్తున్నారని.. పూజా హెగ్డే సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి.. ఆ ప్రేమ పొందడం కోసం ఎలాంటి సంఘర్షణ జరుగుతుందనేదే ఈ చిత్ర కథ అని ఆ మద్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

 

ఇక ఈ చిత్రానికి  'జాన్' అనే టైటిల్ తో పాటు, 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏ టైటిల్ అనేది ఇంకా ఖరారు చేయలేదు.  కాకపోతే ఈ మద్య శర్వానంద్, సమంత జంటగా వచ్చిన జాను చిత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ టైటిల్ పెట్టబోరని అర్థం అవుతుంది. టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఉగాది రోజున రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు.  మరి ఈ ఉగాది ప్రభాస్ కి కలిసి వస్తుందా రాదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: