టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ కా బాప్ అనే పేరు ని సంపాదించుకున్న అల్లు శిరీష్ సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఇప్పటికీ రెడీగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు శిరీష్ చిత్రాలని నిర్మించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ... 2019లో వచ్చిన ఏబిసిడి సినిమా తర్వాత అల్లు శిరీష్ చాలా నెలల వరకు తన నెక్స్ట్ సినిమా తీసేందుకుు సిద్ధపడలేదు.



గతంలో ప్రకాష్ రాజ్ నిర్మించిన గౌరవం సినిమాలో అల్లు శిరీష్ నటించగా ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన శ్రీరస్తూ శుభమస్తూ, క్షణక్షణం కూడా పే-ద్ద డిజాస్టర్ల గా మిగిలి పోయాయి. దీంతో ఖంగుతిన్న అల్లు శిరీష్ సినిమాలకి చాలా కాలం దూరంగా ఉన్నాడు. కానీ ఇటీవల మంచి కథాబలం ఉన్న ఒక స్క్రిప్ట్ ని విన్న అల్లు శిరీష్ తన నెక్స్ట్ సినిమా తీసేందుకు తహతహలడుతున్నాడని చెప్పుకోవచ్చు. అల్లు శిరీష్ తదుపరి సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక చిన్న సినిమా నుండి ఇన్స్పిరేషనల్ గా తీసుకోబడినది అని తెలుస్తోంది. జత కలిసే, విజేత లాంటి రెండు డిజాస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాకేష్ శశి మన నేటివిటీకి తగ్గట్టుగా అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దినట్లు, ప్రస్తుతం స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం.





ఇంకో విశేషం ఏంటంటే 2018వ సంవత్సరంలో 'శైలజారెడ్డి అల్లుడు' అట్టర్ ప్లాప్ సినిమా లో హీరోయిన్ గా నటించిన అనూ ఇమ్మాన్యుయేల్‌ అల్లు శిరీష్ సరసన నటించనుంది. అయితే అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మార్చి 16వ తారీకు ప్రారంభం అవుతుంది. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోని అనూ ఇమ్మాన్యుయేల్‌, అల్లు శిరీష్, దర్శకుడు రాకేష్ శశి అందరూ కలిసి ఒక సినిమా తీసేందుకు సిద్ధం అవ్వగా... మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తని తెలుసుకొని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి కథా బలం ఉన్న ఈ సినిమా ఈసారైనా అందరికీ ఒక హిట్ ని అందిస్తుందో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: