దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మళ్లీ మెగా ఫోన్ పెట్టబోతున్నారు అనే ఊహాగానాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. అది కూడా మెగా స్టార్ చిరంజీవి హీరో గా రాబోయే రోజుల్లో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. వీరి కాంబినేషన్లో దాదాపు 12 చిత్రాలు వచ్చాయి. మరో 2 సినిమాల్లో మెగాస్టార్ సెకండ్ హీరో గా చేశారు. అడవిదొంగ, ఘరానా మొగుడు,  రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, వంటి చిత్రాలు బాక్స్ ఆఫీసు ను బద్దలు కొట్టాయి. 

 

ఇక పోతే వీరి కాంబినేషన్లో శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, నెవర్ బెఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలోని అబ్బని తియ్యని దెబ్బ అనే పాట ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది. ఇకపోతే భక్తి రస చిత్రాలను తీయడంలో దర్శకేంద్రుడు కి పెట్టింది పేరు. శ్రీ మంజునాథ సినిమాతో చిరంజీవికి ఆ అవకాశాన్ని కూడా ఇచ్చారు దర్శకుడు రాఘేంద్రరావు. అయితే కొన్ని రోజులుగా రాఘేంద్రరావు వెండి తెరకు దూరమై బుల్లి తెర కు దగ్గరయ్యారు. 

 

సినిమా వదలి టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేయడంలో బిజీ అయ్యారు. చిరంజీవి కూడా సైరా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అటు తర్వాత లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, చిరంజీవి కలిసి ఒక సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది తెలిసి ప్రేక్షకులు వీరి కాంబినేషన్లో మరో భారీ హిట్ ఖాయమని జోస్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: