తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున.  ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాన ఆయన ఆ మద్య రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’, రాహూల్ రవింద్ర దర్శకత్వంలో ‘మన్మథుడు2’ చిత్రాల్లో నటించిన భారీ డిజాస్టర్స్ పొందాడు.  అంతుకు ముందు కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటించారు నాగార్జున.  ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు.  ముఖ్యంగా తండ్రి కోడుకు పాత్రలో నటించిన నాగార్జున.. బంగార్రాజు గా మాస్ లుక్ తో  కనిపించాడు.  మరోపాత్రలో డాక్టర్ గా అమాయకంగా కనిపించాడు.  అయితే సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో బంగార్రాజు పాత్రకు మంచి పేరు వచ్చింది. 

 

అప్పట్లో ఈ చిత్రం సీక్వెల్ తీస్తారని వార్తలు వచ్చినా.. అది సెట్స్ పైకి మాత్రం రాలేదు.  తాజాగా ఇప్పుడు బంగార్రాజు చిత్రం తెరపైకి తెచ్చేందుకు సిద్దమవుతున్నారట. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున, నాగ చైతన్య కలిసి అప్పట్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘మనం’ చిత్రంలో నటించాడు.  చాలా కాలం తర్వాత మళ్లీ తెరపై ఈ తండ్రీకొడుకులు నటిస్తున్నారు.  యాక్షన్ కి ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న ఈ చిత్రం, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రం తరువాత ఆయన 'బంగార్రాజు' చిత్రం కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. 

 

కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో వున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.  మరి నాగార్జున సరసన ఇంకా ఎవరైనా హీరోయిన్ నటిస్తారా అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే నాగార్జున తనయుడు నాగ చైతన్య రోల్ ఎంత వరకు ఉంటుంది.. ఆయనకు హీరోయిన్ ఎవరు అన్న విషయం పై కూడా క్లారిటీ లేదు. తాజాగా ఆ పాత్రకిగాను సమంతను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రేజీ  కాంబినేషన్ తో ఈ ప్రాజెక్టుపై మరింతగా అంచనాలు పెరిగిపోవడం ఖాయంగా అనిపిస్తోంది. రీసెంట్ గా ఈ జంట మజిలీ చిత్రంలో నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: